Monday, 8 May 2017

మహేష్ కోసం పూరి అంత కష్టపడిపోయాడా?



వారం రోజుల్లో కథ రాసేస్తా.. రెండు వారాల్లో డైలాగ్ వెర్షన్ సహా స్క్రిప్టు రెడీ అయిపోతుంది అని చెబుతుంటాడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన సినిమాలు బాగా ఆడుతున్నపుడు ఈ ముచ్చట్లు బాగానే ఉండేవి. అంత వేగంగా స్క్రిప్టు రాసేస్తాడు అని జనాలు ఆశ్చర్యపోయేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో ఇవే మాటల్ని పూరి రిపీట్ చేస్తుంటే మాత్రం జనాలకు చిరాకు పుడుతోంది.

ఎందుకంటే ఆయన నుంచి వస్తున్న సినిమాలు అలా ఉంటున్నాయి మరి. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్ లాంటి సినిమాల కథల్ని వారంలో రాస్తే ఏంటి.. ఒక్క రోజులో రాస్తే ఏంటి అన్నది జనాల వాదన. ఈ ఫ్రస్టేషన్ పూరి వరకు చేరినట్లుంది. అందుకే ఆయన వారం.. రెండు వారాల మాటలు మాట్లాడట్లేదు.

మహేష్ బాబు కోసం ఓ కథ రాయడానికి రెండు నెలల సమయం తీసుకున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పూరి జగన్నాథ్. ఆ కథే.. ‘జనగణమన’ అట. తన కెరీర్లో ఓ కథ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నది దీని కోసమే అంటున్నాడు పూరి. ఎంతో ఇష్టంతో ఈ కథ రాశానని పూరి చెప్పాడు. కానీ పాపం పూరి అంత సమయం పెట్టి కథ రాసినా మహేష్ బాబు ఆయన్ని కనికరించలేదు. 

subscribe my channel


పూరి పాటికి పూరి ట్విట్టర్లో ఈ సినిమాను అనౌన్స్ చేసేయగా.. మహేష్ మాత్రం పచ్చజెండా ఊపలేదు. వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయాడు. మహేష్ తనకు ఎస్ ఆర్ నో ఏదీ చెప్పకపోవడంపై ఆ మధ్య ‘ఇజం’ ప్రమోషన్ల సందర్భంగా అసహనం వ్యక్తం చేశాడు పూరి. కానీ ఆ సినిమాతో పాటు ‘రోగ్’ కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో పూరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మహేష్ సినిమా మీద ఆశతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి.. 2018లో మహేష్ సినిమాను పట్టాలెక్కించాలని కోరుకుంటున్నాడు. బాలయ్య సినిమా అయ్యాక స్క్రిప్టును మరింత బాగా తీర్చిదిద్దుకుని మహేష్‌ను కలవాలని చూస్తున్నాడు

niharika

నీహారిక‌తో పెళ్లి రూమ‌ర్.. తేజు స్పంద‌న ఇదీ




రెండు రోజుల నుంచి ఒక వార్త‌తో సోష‌ల్ మీడియా.. వెబ్ మీడియా హోరెత్తిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కు.. నాగ‌బాబు త‌న‌యురాలు నీహారిక‌కు పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని.. వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని ఊహాగానాలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. కొంద‌రైతే ఎప్పుడు పెళ్లి అన్న స‌మాచారం కూడా ఇచ్చేశారు. ఐతే ఇది గాలి వార్త అని.. దీనిపై మెగా ఫ్యామిలీ చాలా అప్సెట్ అయింద‌ని స‌మాచారం. స్వ‌యంగా సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ ప్ర‌చారంపై స్పందించాడు. ఈ వార్త‌ను ఖండించాడు.

https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg


subscribe my channel 

victory

వ‌ర‌స ప్ర‌కారం నీహారిక తేజుకు మ‌ర‌ద‌లు కాగా.. అత‌ను మాత్రం ఆమె త‌న‌కు చెల్లెలు లాంటిద‌ని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తామంద‌రం ఒకే కుటంటుంలా.. అన్నాచెల్లెళ్ల మాదిరే పెరిగామని.. త‌మ‌కు పెళ్లేంట‌ని.. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు అధికారికంగా ఒకసారి సరిచూసుకున్న తర్వాతే ప్రచురించాలని మీడియాకు హిత‌వు ప‌లికాడు తేజు. అందులోనూ ఒక మహిళకు సంబంధించిన వార్త రాసేట‌పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. 

ఇలాంటి ఆధారరహిత వార్తలు చాలా బాధపెడ‌తాయని తేజు అన్నాడు. తేజు చిరంజీవి సోదరి విజయదుర్గకు పెద్ద కొడుక‌న్న సంగ‌తి తెలిసిందే. తేజు మాత్ర‌మే కాదు బ‌న్నీ కూడా చ‌ర‌ణ్, వ‌రుణ్‌, నీహారిక‌ల‌ను తోడ‌బుట్టిన వాళ్ల‌లా ట్రీట్ చేస్తాడు. మావ‌య్య అయిన ప‌వ‌న్‌ను అత‌ను బాబాయి అంటాడ‌న్న సంగ‌తి తెలిసిందే