జనతా గ్యారేజ్ కి పోలీసుల పర్మిషన్ కావాలట!
‘జనతా గ్యారేజ్’ ఆగస్ట్ 12న విడుదల అయ్యేందుకు, పాటలు తప్ప మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మొదట యు.యస్ లో అని తరవాత ఖమ్మంలో అని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు హైదరాబాద్ లో జూలై 22న శిల్పకళా వేదికలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అసలే వరస హిట్టులతో ఉన్న ఎన్టీఆర్ ఈ సారి హ్యాట్రిక్ కొడతాడని ఆనందంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు తరలి వస్తున్నారట. అందుకే ‘జనతాగ్యారేజ్’ ఆడియో వేడుకలు గ్రాండ్ గా జరపడానికి చిత్ర యూనిట్ పోలీసుల పర్మిషన్ మరియు సెక్యూర్టీ అరేంజ్ మెంట్స్ చేయాల్సిందిగా కోరుతున్నారంట.
No comments:
Post a Comment